హైదరాబాద్ : ముంబై ఇండియన్స్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సాధారణ స్కోరు చేసింది. మెరుపు ఆరంభం దక్కినా.. బ్యాట్స్మెన్ వరుస విరామాల్లో పెవిలియన్ చేరడంతో భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. దేవదత్ పడిక్కల్(74: 45 బంతుల్లో 12ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ధశతకానికి తోడు మరో ఓపెనర్ జోష్ ఫిలిప్(33: 24 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్) రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(9), డివిలియర్స్(15), శివమ్ దూబే(2) నిరాశపరిచారు. ముంబై బౌలర్ బుమ్రా(3/14) బెంగళూరును వణికించాడు. ట్రెంట్ బౌల్ట్, రాహుల్ చాహర్, పొలార్డ్ తలో వికెట్ పడగొట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm