హైదరాబాద్: 100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్ కోల్మన్ (అమెరికా)పై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) వేటు వేసింది. ఆచూకీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు కోల్మన్పై రెండేళ్ల నిషేధం విధించింది. ఇప్పటికే మూడు సార్లు డోప్ పరీక్షలకు డుమ్మాకొట్టి త్రుటిలో నిషేధం నుంచి బయటపడిన కోల్మన్పై ఏఐయూ ఎట్టకేలకు కొరడా ఝుళిపించింది. 2019 డిసెంబరు 9న క్రిస్ట్మన్ షాపింగ్ తర్వాత ఇంట్లోనే ఉంటానని డోపింగ్ అధికారులకు చెప్పిన కోల్మన్.. వాళ్లు వచ్చినపుడు ఇంట్లో లేడు. "కోల్మన్పై రెండేళ్ల నిషేధం విధిస్తున్నాం. ఈ నిర్ణయంపై క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు" అని ఏఐయూ తెలిపింది.
Mon Jan 19, 2015 06:51 pm