హర్యానా: హర్యానా రాష్ట్రంలోని పంచకుల నగరంలోని మాతా మాన్సాదేవి గోశాలలో రెండు ఆవుల షెడ్లలో 70 ఆవులు మరణించిన ఘటన సంచలనం రేపింది. పంచకులలోని గోశాలలో ఏడు షెడ్లలో 1500 పశువులున్నాయి. ఈ షెడ్లలో 70 ఆవులు మరణించగా,మరో 30 తీవ్ర అనారోగ్యానికి గురయ్యాయి. ‘‘గత రాత్రి రెండు ఎద్దులు పోరాడుకుంటుండగా కార్మికులు చూశారు...కొన్ని ఆవులు నోటి నుంచి నురుగు వస్తూ మరణించడాన్ని కార్మికులు చూశారు’’ అని పంచకుల గోశాల ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ నరేష్ మిట్టల్ చెప్పారు. హర్యానా పశుసంవర్థక శాఖ విభాగానికి చెందిన వైద్యుల బృందం, హిసార్ లోని లాలా లాజ్ త్ రాయ్ యూనివర్శిటీ ఆఫ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ కు చెందిన మరో బృందం గోశాలకు వచ్చి ఆవులనను పరీక్షిస్తున్నాయని డాక్టర్ మిట్టల్ చెప్పారు. ఆవులకు విషం పెట్టడం వల్ల మరణించాయని అనుమానం వ్యక్తం చేశారు. గోశాలలో 70 ఆవుల మృతి ఘటనపై దర్యాప్తు చేస్తామని హర్యానా విధానసభ స్పీకర్ జియాన్ చంద్ గుప్తా చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm