న్యూఢిల్లీ: ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఢిల్లీలో గురువారం రోజు కనిష్ట ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఇది 26 సంవత్సరాలలో అక్టోబర్లో కనిష్ట ఉష్ణోగ్రత అని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. సంవత్సరంలో ఈ సమయంలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రత 15 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఐఎండీ గణాంకాల ప్రకారం 1994 అక్టోబర్ 31న ఢిల్లీలో కనిష్టంగా 12.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
Mon Jan 19, 2015 06:51 pm