హైదరాబాద్: కరోనా కారణంగా ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా వన్య మృగాల సంచారం కనిపిస్తున్నది. జనావాసాల్లోకి జంతువులు వస్తున్నాయి. తాజాగా శంషాబాద్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలోని నిర్మానుష ప్రాంతంలో పెద్దపులి కనిపించింది అంటూ కొంతమంది స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. ఈ వార్త విన్న స్థానికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బయటకు వెళుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm