హైదరాబాద్ : తెలంగాణాలో మళ్లీ కరోనా విజృంభింస్తుంది. కొన్ని రోజులుగా తగ్గుతు వస్తున్న కరోనా ఒక్కసారిగా వ్యాప్తి చెందింది. జగిత్యాల జిల్లాలో కోరుట్ల గురుకుల డిగ్రీ కళాశాలలో 290 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 67 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారితో పాటు 8 మంది టీచర్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేపింది. మొదటి సంవత్సరం బుక్స్ తీసుకునేందుకు విద్యార్థులు నాలుగు రోజుల క్రితం కళాశాల హాస్టల్కు వెళ్లారు. ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు చేయించడంతో కరోనా కేసుల బయటపడ్డాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm