హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల విధులకు నియమించిన వనపర్తి జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయ పర్యవేక్షకుడు వరప్రసాద్ను, ఆర్అండ్బీ అసిస్టెంట్ ఇంజినీర్ కృష్ణమోహన్లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27 న ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరుకావాలని లిఖితపూర్వక సమాచారం పంపినా ఇద్దరు శిక్షణకు హాజరు కాలేదని పేర్కొన్నారు. వర ప్రసాద్కు అధికారులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదని, అదేవిధంగా ఆర్అండ్బీ అసిస్టెంట్ ఇంజినీర్ కృష్ణ మోహన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారని వెల్లడించారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వీరిని తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm