హైదరాబాద్ : రాష్ట్రంలో ఈ నెల 16 నుంచి తొలి విడుత కరోనా వ్యాక్సినేషన్కు అ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. రాష్ట్రానికి ఇప్పటివరకు 3.60 లక్షల డోసులు వచ్చాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా ఫ్రంట్లైన్ వారియర్స్కు టీకాలు పంపిణీ చేసేందుకు 139 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో 99 ప్రభుత్వ దవాఖానలు, 40 పైవేట్ దవాఖానలున్నాయన్నారు. మొదటి డోసు తీసుకున్న వారికి 28 రోజుల తర్వాత రెండో డోసు ఇస్తారని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm