హైదరాబాద్: టాలీవుడ్ యువ హీరో విస్వంత్ నమ్మించి మోసం చేశాడు అంటు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. కార్లను తక్కువ ధరకు ఇప్పిస్తానంటూ ఓ పలువురిని మోసం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హీరో విస్వంత్ తనను నమ్మించి మోసం చేశాడని, తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. కాగా హీరో విస్వంత్.. దిల్రాజు నిర్మించిన 'కేరింత' సినిమాతో పాటు 'ఓ పిట్టకథ', 'జెర్సీ' చిత్రాల్లో నటించారు.
Mon Jan 19, 2015 06:51 pm