హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లా కందిలో ఓ వ్యక్తి మద్యం మత్తులో ద్విచక్రవాహనం దహనం చేశాడు. తాగిన మైకంలో మరో వ్యక్తితో వాగ్వాదానికి దిగాడు. కొంత సమయం తర్వాత తగువు పెట్టుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లిపోయాడు. అతడి వాహనం అక్కడే ఉండగా కోపంతో ఆ వాహనానికి బదులు మరో వ్యక్తి ద్విచక్ర వాహనానికి నిప్పంటించాడు.
Mon Jan 19, 2015 06:51 pm