హైదరాబాద్ : ఛత్తీస్గఢ్ రాష్ట్రం ధమతారి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కబడ్డీ ఆటలో ఒక యువకుడు మృతి చెందాడు. కోకాడి గ్రామానికి చెందిన 20 ఏండ్ల నరేంద్ర సాహు బుధవారం సాయంత్రం గోజీ గ్రామంలో జరిగిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్నాడు. ఆటలో భాగంగా కూతపెట్టి ప్రత్యర్ధి టీం వైపునకు వెళ్లి తిరిగి వస్తుండగా వారు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి కిందపడిన నరేంద్ర సాహు చనిపోయాడు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Mon Jan 19, 2015 06:51 pm