హైదరాబాద్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోసాని పేట గ్రామానికి చెందిన మంగలపల్లి లక్ష్మణ్ గురువారం రోజు ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు.. భార్య చేసిన పనికే లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. లక్ష్మణ్ భార్య ఇటీవల బీర్షబా సంస్థలో 3 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు తెలిసింది. ఆ సంస్థ కొద్దిరోజుల క్రితం మూసివేయడంతో అప్పులపాలైన విషయం లక్ష్మణ్ కి తెలిసింది. అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. డబ్బులు తిరిగి వస్తాయా లేవా అన్న ఆందోళన మొదలైంది. ఇదిలా వుంటే, భార్య పిల్లలతో కలిసి కామారెడ్డిలో నివాసముంటున్న లక్ష్మణ్ గురువారం ఇంటికి వెళ్లివస్తానని పోసానిపేట వెళ్లాడు. అదేరోజు తాను చనిపోతున్నానని భార్యకు వీడియో కాల్ చేసి లైవ్ లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకొని.. తన చావుకు కారణాలను చెప్పాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన భర్త మరణం తర్వాత బీర్షబా గ్రూపులో భార్య పెట్టిన వాయిస్ రికార్డ్ ఇప్పుడు వైరల్ గా మారింది. మృతుడు లక్ష్మణ్ విద్యుత్ వైరింగ్ పని చేస్తున్నాడు. భార్య జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- Jan 25,2021 04:32PM