హైదరాబాద్ : వ్యవసాయ కొత్త చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారు. రిపబ్లిక్డే నాడు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక ఫిబ్రవరి 1న పార్లమెంటుకు వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్టు తాజాగా ప్రకటించాయి. క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు.
Mon Jan 19, 2015 06:51 pm