హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్స్టేషన్ పరిధి చింతల్ మెట్లో గల ఓ కూలర్ గోదాములో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm