హైదరాబాద్ : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులను రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధానాలయంతో పాటు, ఆలయం చుట్టూ నిర్మితమవుతున్న నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ నిర్మాణ పనులు భేషుగ్గా సాగుతున్నాయని ప్రశంసించారు. అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికి, స్వామివారి ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆలయ ఈవో గీత, ఏఈవోలు శ్రవణ్కుమార్, రమేశ్బాబు తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm