హైదరాబాద్: ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కేంద్రంలోని బుట్టిగుడ వీధిలో ఓ జంట ఉద్యోగం వచ్చిందంటూ స్వీట్స్ పంచి ఏకంగా ఏనిమిది ఇండ్లు దోచేశారు. ఉషా పటేల్ అనే మహిళ ఇంట్లో సుభాష్ దంపతులు అద్దెకు దిగి..ఉద్యోగం వచ్చిందాంటీ అంటూ స్వీట్స్ పంచారు. దీంతో సంతోషంతో ఆ వీధిలో ఉన్న వారు మత్తు కలిపిన మిఠాయిలు తిన్నారు. ఆ తరువాత ఇంటి యజమాని ఇంటితో సహా ఏకంగా రూ.35 లక్షలు విలువ చేసే బంగారాన్ని దోచేసి ఎస్కేప్ అయ్యిందా కిలాడీల జంట. అద్దెకు ఉంటున్న యజమాని ఇంటితో సహా ఆ వీధిలోని మరో ఏడు ఇళ్లను కూడా దోచేశారు.
Mon Jan 19, 2015 06:51 pm