హైదరాబాద్ : టర్కీలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో 11మంది దుర్మరణం చెందారు. ఆగ్నేయ టర్కీలోని బిట్లిస్ ప్రావిన్సులో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న 11 మంది మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతుల్లో లెఫ్టినెంట్ జనరల్ ఉస్మాన్ ఎర్బాస్ కూడా ఉన్నారు. బిట్లిస్ ప్రావిన్సులోని పర్వత ప్రాంతంలో మంచు, దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm