హైదరాబాద్ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్లమెంటులో విశ్వాస పరీక్షకు సిద్ధమయ్యారు. సెనేట్ స్థానం ఎన్నికలో సొంత పార్టీకే చెందిన ఆర్థిక మంత్రి అబ్దుల్ హఫీజ్ షేక్ ఓటమి తర్వాత ప్రధాని పదవికి రాజీనామా చేయాలనే విపక్షాల డిమాండ్ నేపథ్యంలో ఇమ్రాన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీలో శనివారం విశ్వాస పరీక్ష నిర్వహించనున్నట్లు ఇమ్రాన్ఖాన్ ప్రకటించారు. తమ ప్రభుత్వ విశ్వసనీయతను చాటిచెప్పేందుకే విశ్వాసపరీక్ష నిర్వహణకు సిద్ధమైనట్లు దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇమ్రాన్ తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm