హైదరాబాద్ : స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ ఫైనల్లో తెలుగు తేజం పీవీ సింధు నిరాశ పరిచింది. స్పెయిన్కు చెందిన క్రీడాకారిణి కరోలినా మారిన్ చేతిలో ఓటమి పాలైంది. వరుస సెట్లలో 12-21, 5-21 తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. 35 నిమిషాల్లోనే ఆట ముగిసింది. మారిన్ చేతిలో సింధుకు ఇది మూడో ఓటమి. దాదాపు 18 నెలల తర్వాత సింధు తొలిసారి ఫైనల్ ఆడగా.. మారిన్ ఇదే ఏడాదిలో మూడో టైటిల్ను సొంతం చేసుకుంది.
Mon Jan 19, 2015 06:51 pm