నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
విద్య ద్వారానే విజ్ఞానం వస్తాదని పూలే అనే విషయం అందరికీ ఆదర్శం కావాలని న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి ఆకుల పాపయ్య మహాత్మ జ్యోతిబాపూలే 194 వ జయంతి సందర్భంగా నగరంలోని ఐ.ఎఫ్.టి.యు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆకుల పాపయ్య మాట్లాడుతూ విద్య ద్వారానే సమాజం అభివృద్ధి జరుగుతుందని, విజ్ఞానం పొందినప్పుడే ఇంకా ఎన్నో రకాల సౌకర్యాల కొరకు ఆలోచించడానికి మేధస్సు పని చేస్తుందని అన్నారు. సమాజ నిర్మాణానికి విద్య చాలా అవసరం అని చెప్పిన మహాత్ములు పూలే ను కొనియాడారు. విద్య సామాజిక అంతరాలు పోగోట్టడానికి ఉపయోగ పడుతుంది అన్నారు. అందరూ పూలేను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ, ప్రజాసంఘాల నాయకులు పరుచూరి శ్రీధర్, జెల్ల మురళి, నీలం సాయిబాబా, ఎల్బి.రవి, ఎం.మోహన్, భాస్కర్, రాజేశ్వర్ , సాయికృష్ణ, ప్రేమ్ చంద్, సాయిలు, గంగాధర్, బీరయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 11 Apr,2021 07:16PM