హైదరాబాద్: ఐఎంఎస్ కుంభకోణంలో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నింధితులైన శ్రీనివాస్ రెడ్డి, ముకుందారెడ్డి, వినయ్రెడ్డి, దేవికారాణిలకు ఈడీ సమన్లు పంపింది. నిందితులు 10 రోజుల్లో విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. శ్రీనివాస్రెడ్డి, ముకుందారెడ్డి, దేవికారాణిది కీలకపాత్రగా భావిస్తున్న ఈడీ ..బుర్ర ప్రమోద్ రెడ్డి డొల్ల కంపెనీలపై కూపీ లాగుతుంది. ఈ డొల్ల కంపెనీల వెనుక నేతల ప్రమేయంపై ఆధారాలు సేకరిస్తుంది. ఐఎంఎస్ కుంభకోణంతో నగలు, ఆస్తులు కూడబెట్టుకున్నట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేసింది. అక్రమ సొమ్ముతో కూడబెట్టిన ఆస్తులు అటాచ్ చేసేందుకు ఈడీ కసరత్తు చేస్తుంది. అ.ని.శా. కేసుల ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ దర్యాప్తు చేస్తుంది.
Mon Jan 19, 2015 06:51 pm