నవతెలంగాణ కోడేరు
భావాయిపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి, బీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్స్ ను ప్రాంభించారు. అదేవిధంగా మిషన్ భగీరథ నుంచి ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే పథకం ను ప్రారంభించి, కల్యాణ లక్ష్మీ చెక్కు లను పంపిణి చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు , అభినవ యూవత పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టి కి తీసుకరగా తొందరలో పరిష్కరిస్తా అని హామీ ఇచ్చారు. అనంతరం జనుంపల్లి లో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టి సి ఎ రాష్ట్ర కార్యదర్శి దూ రెడ్డి రఘు వర్ధన్ రెడ్డి, సర్పంచ్ లు కఱ్ఱెమ్మ, కవిత కురుమ య్యా, మండల, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజ శేఖర్ గౌడ్, రాజ వర్ధన్ రెడ్డి తదితరులు వున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 11 Apr,2021 08:11PM