హైదరాబాద్ :పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కేబీ. దొడ్డికి చెందిని బైండ్ల రాజేందర్(25) అదే గ్రామానికి చెందిన యువతి(19) పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆమెతో అనేక సార్లు శారీరకంగా కలిశాడు. ఈ క్రమంలో పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా ముఖం చాటేశాడు. ఎన్ని సార్లు పెళ్లి ప్రస్తావని తీసుకొచ్చిన మోఖం చాటేశాడు. దీంతో, తాను మోసపోయానని గ్రహించిన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Mon Jan 19, 2015 06:51 pm