హైదరాబాద్: భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మద్యం మత్తులో ఉన్న భర్తను భార్య దారుణంగా చంపేసింది. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. జేజే నగర్ లో మోహన్ (41), అతని భార్య పద్మ (37) బీబీఎంపీ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలున్నారు. ఆదివారం రాత్రి మోహన్ మద్యం తాగి ఇంటికి రాగా.. ఆ సమయంలో ఆ భార్యాభర్తల మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో మత్తులో ఉన్న మోహన్ కిందపడిపోయాడు. భార్య పద్మ అతని మెడపై కాలు పెట్టి తొక్కింది. దీంతో అతడు స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆసుపత్రిలో తరలిస్తుండగా అతడు చనిపోయాడు. దీంతో పద్మను జేజే నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm