హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షం కురిసింది. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. బోధన్, ఎడపల్లి, వర్నీ, జక్రాన్పల్లి, దర్పల్లి, నవీపేట మండలాల్లో వడగళ్ల వాన పడింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొనుగోలు కేంద్రాలలో వున్న ధాన్యం తడిసింది.
Mon Jan 19, 2015 06:51 pm