కైరో: ఈజిప్టులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు బోల్తా పడటంతో 20 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కైరో నుంచి అసియుట్కు వెళ్తున్న బస్సు.. ట్రక్కును ఓవర్టేక్ చేస్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. బోల్తాపడ్డ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో మంటలు చెలరేగి రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm