న్యూఢిల్లీ : అగ్రరాజ్యం అమెరికా వెనక్కి తగ్గింది. తన స్వరాన్ని తగ్గించింది. భారత్ ముందస్తు అనుమతి లేకుండా భారత ప్రాదేశిక జలాల్లో నేవీ ఆపరేషన్ నిర్వహించిన యూఎస్.. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే తాము ఈ పని చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి ఇండియా అనుమతి అవసరం లేదని అహంకారంగా మాట్లాడింది.
అయితే ఇప్పుడు ఆ దేశం కాస్త వెనక్కి తగ్గుతూ మరో ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 7న యూఎస్ నేవీ 7వ ఫ్లీట్లో భాగమైన యూఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్, హిందూ మహా సముద్రంలో రొటీన్ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్ నిర్వహించింది. అంతర్జాతీయ చట్టాలకు, ప్రపంచవ్యాప్తంగా సముద్రాల స్వేచ్ఛకు అమెరికా మద్దతు తెలపడంలో భాగంగా ఈ పని చేశామని, వివిధ అంశాల్లో తాము భారత భాగస్వామ్యాన్ని గౌరవిస్తామని చెప్పుకొచ్చింది. ఇండోపసిఫిక్లో ప్రాంతీయ భద్రత కూడా అందులో భాగం అని అమెరికా రక్షణ శాక్ష అధికార ప్రతినిధి అన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 14 Apr,2021 10:41AM