చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మాక్స్వెల్(59: 41 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) తన మార్క్ షాట్లతో అలరించాడు. చెపాక్ మైదానంలో సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. మాక్స్వెల్ అర్ధశతకానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ(33: 29 బంతుల్లో 4ఫోర్లు) రాణించడంతో బెంగళూరు గౌరవప్రదమైన స్కోరు చేసింది. దేవదత్ పడిక్కల్(11), శాబాజ్ అహ్మద్(14), ఏబీ డివిలియర్స్(1), వాషింగ్టన్ సుందర్(8) తీవ్రంగా నిరాశపరిచారు. సన్రైజర్స్ బౌలర్లలో హోల్డర్ మూడు వికెట్లు తీశాడు.
Mon Jan 19, 2015 06:51 pm