చెన్నై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ క్రికెట్ అభిమానులను అలరించింది. మ్యాచ్ చివరి వరకు గెలుపు ఇరు జట్లతోనూ దోబూచులాడింది. దీంతో చివరి బంతి వరకు విజేత ఎవరో తేలలేదు. ఆఖరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు మ్యాచ్ను మలుపుతిప్పేశారు. 10 ఓవర్ల వరకు బెంగళూరుతో పోల్చితే ముందంజలో ఉన్న సన్రైజర్స్.. కెప్టెన్ డేవిడ్ వార్నర్(38: 24 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) వికెట్ తర్వాత అతలాకుతలమైంది. ఆ తర్వాత మిగతా బ్యాట్స్మన్ పెద్దగా రాణించలేదు. దీంతో 17వ ఓవర్లో 3 వికెట్లు కోల్పోయిన రైజర్స్ మ్యాచ్పై ఆశలు కఠినం చేసుకుంది. అంతేకాకుండా ఆ తర్వాత కూడా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆర్సీబీవైపు మళ్లింది. చివరి ఓవర్లో 16 పరుగుల కావల్సి ఉండగా.. 9 పరుగులు మాత్రమే చేసిన సన్రైజర్స్ 2 వికెట్లు కోల్పోయింది. దీంతో ఆర్సీబీ టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
Mon Jan 19, 2015 06:51 pm