చెన్నై: ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లిని మ్యాచ్ రిఫరీ మందలించారని తెలిసింది. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను అతను ఉల్లంఘించాడని రిఫరీ మందలించాడు. బుధవారం సన్రైజర్స్ తో మ్యాచ్ సందర్భంగా కోహ్లి సహనం కోల్పోయాడు. 29 బంతుల్లో 33 పరుగులు చేసి అవుటైన విరాట్.. తమ టీమ్ డగౌట్ వైపు వెళ్తూ బౌండరీ దగ్గర అడ్వర్టైజింగ్ బోర్డును అలాగే ఓ కుర్చీని బ్యాట్తో కొడుతూ కోపంగా వెళ్లాడు.
ఇది ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం లెవల్ 1 నేరం కిందకు వస్తుంది. క్రికెట్ పరికరాలు లేదా బట్టలు, మైదానంలోని పరికరాలు, హోర్డింగ్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే దాన్ని నేరంగా చూస్తారు. దీని ప్రకారం కోహ్లిది లెవల్ 1 నేరంగా ప్రకటించిన రిఫరీ అతన్ని మందలించి, వదిలేసినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 15 Apr,2021 10:36AM