వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. వైరస్ గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకింది. కరోనా మహమ్మారి కేసులు గ్రామాల్లో వందల సంఖ్యలో పెరిగిపోతున్నాయి. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాలో 2000 పైగా కేసులు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలో క్వారంటైన్ సెంటర్లను అధికార యంత్రాంగం ఏర్పాటు చేయండంతో టీకా కేంద్రాల వద్దకు జనాలు పరుగులు తీస్తున్నారు. పర్వతగిరి మండలం ఎనుగల్ గ్రామంలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. గ్రామంలో కేసులు పెరగడం వల్ల ఎనుగల్లో గ్రామ సర్పంచ్, పెద్దలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు.
Mon Jan 19, 2015 06:51 pm