గుంటూరు: ఏపీహోంమంత్రి సుచరిత గురువారం సాయి భాస్కర్ హాస్పిటల్ లో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా ఉధృతి పెరుగుతోందన్నారు. కరోనా వ్యాక్సిన్ ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఇచ్చామని, పీఎం పిలుపు మేరకు వ్యాక్సినేషన్కు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. బూస్టర్ డోస్ కూడా తప్పకుండా తీసుకోవాలన్నారు. కరోనా కేసులు పెరగటానికి నిర్లక్ష్యం కూడా కొంత కారణమేనన్నారు. స్వీయ నియంత్రణ పాటించాలని, అవసరమైన వాళ్లు మాత్రమే బయటకు రావాలని సుచరిత సూచించారు.
Mon Jan 19, 2015 06:51 pm