- పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆదేశాలతో కొనసాగుతున్న సమగ్ర సమగ్ర విచారణ
నవతెలంగాణ కంటేశ్వర్
మహిళా బాధితురాలికి లక్ష రూపాయలు డిమాండ్ చేసిన కేసులో పోలీసు అధికారులకు ఉచ్చు బిగియనున్నది. ఎస్సై లంచావతారంపై నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ సీరియస్ గా స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. సీపీ ఆదేశాల మేరకు సమర్థవంతుడైన మూడు విభాగాల అధికారులతో విచారణ చేపట్టారు. గత రాత్రి నుండి జరుగుతున్న విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఎస్సై లక్ష రూపాయలు అలాగే రెండు మేకలు డిమాండ్ చేయడం వెనుక అసలు సూత్రధారి మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మస్తాన్ అలీ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే విషయాన్ని స్వయంగా ఎస్సై నారాయణ జిల్లా పోలీస్ అధికారికి వివరించినట్లు తెలుస్తోంది. లక్ష రూపాయలు డిమాండ్ చేయమని స్వయంగా సీఐ నాతో చెప్పినట్టు ఎస్ఐ అధికారికి వెల్లడించినట్లు దీనిని సీరియస్ గా పరిగణించిన సిపి కార్తికేయ నిజామాబాద్ ఎసిపి శ్రీనివాస్ ను(నిజామాబాద్ అడిషనల్ ఎస్ పి శ్రీనివాస్) విచారణ అధికారిగా నియమించి నివేదిక అందించాలని సిపి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ఏ సి పి శ్రీనివాస్ బాధితులను పిలిపించి స్వయంగా మూడు గంటల పాటు సమగ్ర దర్యాప్తు వారి నుంచి లక్ష డిమాండ్ , మేకల దావత్ పై పూర్తి వివరాలు సేకరించి నివేదిక అందించాలని ఈ నివేదిక ఆధారంగా మహిళా పోలీస్స్టేషన్ సీఐ మస్తాన్ అలీ ఎస్సై నారాయణ, ఏ ఎస్సై శ్రీనివాస్ రెడ్డి ల పై సస్పెన్షన్ వేటు వేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ,పోలీస్ శాఖలో లంచం డిమాండ్ సంఘటన చర్చనీయాంశంగా మారింది. శాఖనుఅవినీతి కంపు పట్టిపీడిస్తోంది.
గత సంవత్సర కాలంగా చూస్తే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లంచాల కోసం కక్కుర్తి పడి ఉద్యోగాలు పోగొట్టుకొని పోలీసు శాఖలో చెడ్డపేరు తీసుకొస్తున్న కొంతమంది పోలీసు అధికారులు చేసే పనుల వలన ప్రజల్లో పరువు పోతుంది. పోలీసులు పై ఉన్న నమ్మకం కాస్త తగ్గిపోతుంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా తమ భర్తలు వేధిస్తున్నారని స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళితే అక్కడి నుంచి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహిళ పోలీస్ స్టేషన్ బాధితులను అయా పోలిస్టేషన్ సిబ్బంది ఇక్కడికి పంపుతున్నారు.ఇక వారి కడుపు గోస చెప్పుకోవడానికి క్యూలు కడుతున్నారు.అయితే ఇక్కడ అ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునే పోలీసుశాఖలో కనీసం తండ్రి స్థాయిలో అన్న స్థాయిలో ఉన్న పోలీసు అధికారులు మా భర్త నన్ను వరకట్నం కోసం వేధిస్తున్నారని సమస్యలు చెప్పుకోవడానికి వస్తే కనీసం మానవత్వం లేకుండా లక్షలకు లక్షలు నా నెంబర్ ఇస్తా నా అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ చెయ్ అలాగే రెండు మేకలు కోసి దావత్ పెట్టండి నేను మా సారు అందరం కలిసి వస్తాం అని మూర్ఖత్వంతో మాట్లాడుతున్న పోలీసు అధికారుల తీరు పట్ల బాధితులు మానసిక క్షోభకు గురవుతున్నారు.కారణం ఎందుకంటే సమస్య వస్తే సమస్య పరిష్కరించాల్సిన పోలీసులు మానవత్వం లేకుండా డబ్బులు దావతులు అడగటం ఒక పక్క అయితే మరోపక్క నా భర్త పెళ్లి చేసుకున్న నెలరోజులకే నన్ను చిత్రహింసలకు గురిచేస్తూ అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నాడని బాధిత మహిళలు పోలీసులకు గోడు వెళ్లబోసుకున్నారు. కానీ మరి నీచాతి నీచంగా మీ భర్త వేధించడం పక్కన పెట్టు రాత్రి సమయంలో కనీసం నిన్ను సంతోష పెడతాడా లేదా అంటూ అడగరాని మాటలతో మాట్లాడుతున్న మహిళ పోలీస్ స్టేషన్ ఎస్సై మానసిక క్షోభకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి మానవత్వం లేని పోలీసుల పట్ల సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మరికొంత మంది మీడియా ముందుకు సిఐ బాధితులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మహిళ పోలీస్ స్టేషన్ లో వరకట్నం కేసు విషయంలో ఒక లక్ష రూపాయలు నా అకౌంట్ కొట్టు నీ కేసు క్లియర్ చేస్తా అంటూ మహిళ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారాయణ ఆడియో టేప్ వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఒక్క వార్తతో తీగలాగితే డొంక అంతా బయట పడిన విషయం లో యదార్థమైన నిజాలు నిజం నిప్పు లాంటిది అని చెప్పే బాధితులు తరలి వస్తున్నారు. మహిళా పోలీస్ స్టేషన్ లో చాలా రోజులుగా ఏ ఫిర్యాదు వచ్చిన సమస్య పరిష్కారం కావాలంటే ఎస్ఐలకు సిఐ కి డబ్బు ముట్టచెప్పనీదే పని కాదు.ఈహొ ఆరోపణలు గతం లో బయట ప్రచారం జరిగినా ఇప్పుడు అవి నిజమని తేలింది. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ మస్తాన్ కూడ లంచం తీసుకోవడం లో ఆరు తేరిన అధికారే పెర్కిట్ కు చెందిన వరకట్నం బాధితురాలి కేసు లో 2 లక్షలు డిమాండ్ చేయగా 1 లక్షకు డీల్ ఉదుర్చుకొని 80 వెలు లంచం తీసుకోని న్యాయం చేయక పొగ బాధితుల పైనే బెదిరింపులకు పాల్పడుతున్నాడు.
పైగా తన సెల్ ఫోన్ లో వీడియో ఆన్ చేసి బాధితులు మాట్లాడే విషయాన్ని వీడియో రికార్డు చేసి బెదిరిస్తున్నారని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఎస్ ఐ నారాయణ పై జరుగుతున్న విచారణలో సి ఐ మస్తాన్ పై అలాగే మరో అధికారి ఏ ఎస్ ఐ శ్రీనివాస్ రెడ్డి లు కీలక పాత్రలుగా ఉన్నట్లు తెలుస్తుంది. నిజామాబాద్ ఏసిపి శ్రీనివాస్(నిజామాబాద్ డిసిపి శ్రీనివాస్) స్థాయిలో జరుగుతున్న ఈ విచారణ ఏ మేరకు కొనసాగుతుందో వేచి చూడాలి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 16 Apr,2021 08:41PM