హైదరాబాద్: పదెనిమిదెండ్లకే పెండ్లి చేసుకన్నాడు. మరో యువతితో ప్రేమలో ఉన్నాడు. ఇద్దరి మధ్య సతమతం అయిన ఆ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. సైదాబాద్ పోలీసుల వివరాల ప్రకారం.. రెయిన్బజార్కు చెందిన జమాల్పుర్ కరణ్లాల్ మాంసం అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమారుడు దీపక్కుమార్(18) కూడా తండ్రికి చేదోడువాదోడుగా ఉండేవాడు. గతేడాది హయత్నగర్కు చెందిన ఓ యువతిని ప్రేమించి పెండ్లి చేసుకొని, హయత్నగర్లోనే ఉంటున్నాడు. ఇటీవల మరో యువతితో ప్రేమవ్యవహారం సాగిస్తున్న విషయం భార్యకు తెలిసింది. అప్పటినుంచి భార్య, ప్రియురాలి ఒత్తిళ్లు భరించలేకపోతున్నానంటూ పలుమార్లు సైదాబాద్లోని స్నేహితులతో చెప్పుకుని బాధపడేవాడు. శనివారం సాయంత్రం స్థానిక ధోబీఘాట్ వద్దకు వచ్చాడు. చరవాణిలో తండ్రితో మాట్లాడుతూ.. జీవితంపై విరక్తితో ఎర్రకుంట చెరువు సమీపంలోని పాడుబడిన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో దిక్కుతొచని తండ్రి 100కు సమాచారం ఇవ్వడంతో సైదాబాద్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దీపక్కుమార్ బావిలో దూకేశాడు. మృతదేహాన్ని వెలికితీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm