హైదరాబాద్: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సికింద్రాబాద్లో చోటుచేసుకుంది. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాగూడ బ్రిడ్జ్ కింద పట్టాలపై రాత్రి 10 గంటల సమయంలో సుమారు 55 ఏండ్ల వయసు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మార్చురీకి తరలించారు. మృతుడు చామనచాయ రంగు ఉంటాడని, బ్లాక్ కలర్ ప్యాంట్, తెలుపు రంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm