చింతూరు: ముక్కు, చెవులు కోసి పెద్ద భార్యను, పెట్రోల్ పోసి నిప్పంటించి చిన్న భార్యను హత్యచేయపోయాడు భర్త కల్యాణం వెంకన్న. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామంలో చోటు చేసుకుంది. చిన్న భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన కల్యాణం వెంకన్నకు ఇద్దరు భార్యలు. నాలుగు రోజుల కిందట పెద్ద భార్య ముక్కు, చెవులను కత్తితో కోయడంతో ఆమె భయంతో తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. అదే రోజు వెంకన్న.. తన చిన్న భార్యను మాయమాటలతో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. గాయపడిన ఆమె తప్పించుకొని భద్రాచలంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఆ తరువాత రోజు వెంకన్న భద్రాచలం వెళ్లి గొడవకు దిగడంతో బాధితురాలు చింతూరు పోలీసులను ఆశ్రయించింది. వెంకన్న పై కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్బాబు తెలిపారు.
ఇదీ చదవండి
మామ అంత్యక్రియలకు వచ్చి అల్లుడు.. అల్లుడు మరణవార్త విని అత్త ...
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Apr,2021 09:37AM