హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 4009 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,55,433 కి చేరింది. ఇప్పటి వరకు 3,14,441 మంది కోలుకోగా ప్రస్తుతం 39,154 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గత 24 గంటల్లో 14 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1838కి చేరింది. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కేసులు... ఆదిలాబాద్ జిల్లా72, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 49, జీహెచ్ఎంసీ పరిధిలో 705, జగిత్యాల జిల్లా 175, జనగాం జిల్లా 34, భూపాలపల్లి జిల్లా 22, జోగులాంబ గద్వాల జిల్లా 32, కామారెడ్డి జిల్లా 115, కరీంనగర్ జిల్లా135, ఖమ్మం జిల్లా 113, ఆసిఫాబాద్ జిల్లా 25, మహబూబ్ నగర్ జిల్లా 129, మహబూబాబాద్ జిల్లా 36, మంచిర్యాల జిల్లా 111,మెదక్ జిల్లా 60, మేడ్చల్ జిల్లా 363, ములుగు జిల్లా 26, నాగర్ కర్నూల్ జిల్లా 33, నల్లగొండ జిల్లా 58, నారాయణపేట జిల్లా 34, నిర్మల్ జిల్లా 90, నిజామాబాద్ జిల్లా 360, పెద్దపల్లి జిల్లా 39, రాజన్న సిరిసిల్ల జిల్లా 80, రంగారెడ్డి జిల్లా 336, సంగారెడ్డి జిల్లా 264, సిద్దిపేట జిల్లా 125, సూర్యాపేట జిల్లా 69, వికారాబాద్ జిల్లా 65, వనపర్తి జిల్లా 39, వరంగల్ రూరల్ జిల్లా 49, వరంగల్ అర్బన్ జిల్లా 146, యాదాద్రి జిల్లా 20 కేసులు నమోదయ్యాయి.
Mon Jan 19, 2015 06:51 pm