హైదరాబాద్ : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. రాజేంద్రనగర్ సర్కిల్ అత్తాపూర్ తేజస్వినికాలనీ అకుల్ అగర్వాల్, సావన్ అగర్వాల్ నివాసం ఉంటారు. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రెండు రోజుల క్రితం భార్యాభర్తలిద్దరికీ గొడవ జరిగింది. సావన్ అగర్వాల్ ఇంట్లో గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుని ఉరేసుకుంది. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో అకుల్ అగర్వాల్ కిటికి అద్దాలు పగులగొట్టి లోపలికి చూడగా భార్య ఉరేసుకుని కనిపించింది. కిటికి అద్దాలు పగులగొట్టే సమయంలో అకుల్ అగర్వాల్కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో ఆయనను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సావన్ అగర్వాల్ కుటుంబ సభ్యులు తన కూతురి మరణంపై అనుమానాలున్నాయని రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm