జీడిమెట్ల : నగరంలోని వేర్వేరు చెరువుల్లో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మల్లంపేట చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైంది. మృత దేహాన్ని వెలికి తీసి పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అలాగే బోరంపేట్లోని చెరువులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈతగాళ్లు చెరువులోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడిని బోరంపేట్ నివాసి సంతోష్ (23)గా పోలీసులు గుర్తించారు. రెండు కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Mon Jan 19, 2015 06:51 pm