రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని ఇల్లంతకుంట పోలీసు స్టేషన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థతి నెలకొంది. ఏబీవీపీ, టీఆర్ఎస్ నాయకులు పోలీసుస్టేషన్లో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇల్లంతకుంటలో మంత్రి కేటీఆర్ పర్యటనను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీసుస్టేషన్కు తరలించారు. స్టేషన్లోనే ఏబీవీపీ కార్యకర్తలకు టీఆర్ఎస్ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని నిలువరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm