నవతెలంగాణ-గుండాల
ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా చింత నరసింహారావు, పర్శిక రవి ఎన్నికయ్యారు.ఈ విషయమై సోమవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ... ఆదివారం మండలంలోని యాపలగడ్డ గ్రామంలో జరిగిన జిల్లా స్థాయి నిర్మాణ జనరల్ బాడీలో సమావేశంలో తమను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని చెప్పారు.తమపై నమ్మకంతో అధ్యక్షకార్యదర్శులుగా ఎన్నుకొన్నందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి, రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఎయిర్ పోర్టులు ప్రయివేటు పెట్టుబడిదారి కార్పొరేట్ శక్తులలైన అంబానీ, ఆదాని లాంటి బడా పెట్టుబడిదారులకు దారాదత్తం చేసి, నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిరుద్యోగ భృతి ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై యువత పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 19 Apr,2021 06:59PM