హైదరాబాద్: ఎన్నికలు తాము నిలిపివేయలేమన్న ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. తెలంగాణలో పుర, నగరపాలక ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు ఆ పరీశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు సూచించింది. కొవిడ్ ఉద్ధృతి దృష్ట్యా మినీ పుర పోరును వాయిదా వేయాలంటూ షబ్బీర్ అలీ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్నికలు తాము నిలిపివేయలేమన్న ఉన్నత న్యాయస్థానం దానిపై ఎస్ఈసీ తగిన నిర్ణయం తీసుకుంటుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్ 7కి వాయిదా వేసింది.
Mon Jan 19, 2015 06:51 pm