హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, విజయ్ సేన్రెడ్డి లతో కూడిన ధర్మాసనం కరోనా పరీక్షలు, చికిత్సలు, నియంత్రణపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అధికారులపై ఉన్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. ఈనెల 1 నుంచి 21 వరకు 19.64 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ర్యాపిడ్ టెస్టులు 16.17 లక్షలు 3.47 లక్షలు ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం హైకోర్టుకు వివరించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఎప్పుడు పెంచుతారని హైకోర్టు ప్రశ్నించింది.
కరోనా రెండో దశ పొంచి ఉందని తెలిసినా సరైన ఏర్పాట్లు సిద్ధం ఎందుకు చేసుకోలేదని ప్రశ్నించిన హైకోర్టు కరోనా రెండో దశ వ్యాప్తి చెందాకా మేల్కొంటున్నారా? అంటూ ఘటుగా వ్యాఖ్యానించింది.
కరోనా నియంత్రణకు రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. కేవలం రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తే సరిపోతుందా? అంటూ హైకోర్టు తీవ్రస్తాయిలో ప్రశ్నించింది. థియేటర్లు, మద్యం దుకాణాలు, బార్లు, పబ్లలో ఆంక్షలేవి, ఎన్నికల ర్యాలీలపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదు, పెళ్లిళ్లు అంత్యక్రియలకు ఆంక్షలున్నాయి, ఎన్నికలు అతీతమా అంటూ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కరోనా బారిన పడ్డారని కోర్టుకు తెలిపిన ప్రభుత్వం కరోనాపై నిపుణుల కమిటీని గతంలోనే ఏర్పాటు చేశామని విన్నవించింది. అయితే ఆ కమిటీ ఎన్ని సార్లు సమావేశం అయింది. ఏన్ని సలహాలు ఇచ్చిందో తెలపాలని కోర్టు ఆదేశించింది. మరణాలపై ప్రభుత్వం కాకిలెక్కలు చెప్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయని హైకోర్టు హెచ్చరించింది. ఈ విచారణకు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి హజరయ్యారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Apr,2021 02:58PM