రంగారెడ్డి : జిల్లా కేశంపేట మండల కేంద్రానికి చెందిన నారా అమృత(25)కు అల్వాల్ గ్రామానికి చెందిన వ్యక్తితో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. కుబుంబ కలహాల కారణంతో ఆమె భర్త నుంచి నాలుగేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి అమృత తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కూలీపని చేసుకునే ఈమెకు ఆమనగల్లు మండలం పోలెపల్లికి చెందిన జంగాపురం శంకర్తో పరిచయం ఏర్పడింది. ఇది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే అమృత మరొకరితో సంబంధం పెట్టుకుందని అనుమానం పెంచుకున్న శంకర్ ఆమె హత్యకు పథకం వేశాడు. మార్చి 31న అమృతకు మద్యం తాగించిన శంకర్ తన బైక్పై తలకొండపల్లి మండలం చెన్నారం గ్రామ సమీపంలోని మల్లప్పగుట్ట వద్దకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఫోన్ద్వారా తన స్నేహితుడైన ఆమనగల్లు మండలం విఠాయిపల్లికి చెందిన ఇస్లావత్ శంకర్కు సమాచారం ఇచ్చి పిలిపించాడు. ఇద్దరూ కలిసి అమృత మెడకు చున్నీ బిగించి చంపేసినట్లు తెలిపాడు. అనంతరం గుట్ట పక్కనే ఉన్న గుంతలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. కాగా ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm