- వయో వృద్ధులకు వ్యాక్సిన్ కోసం హెల్ప్ ఏజ్ ఇండియాకు25 వేల ఉచిత రైడ్లు
గుర్గ్రామ్: దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ సందర్భంగా ఇప్పటివరకు సుమారు 60 వేల మంది రైడర్లు ఉబర్ ఉచిత సర్వీసుని ఉపయోగించుకున్నట్లు ఉబర్ ప్రకటించింది. అలాగే ఉచిత రైడ్లు ఉపయోగించుకున్న వారిలో 86 శాతం మంది ఢిల్లీ ఎన్సీఆర్లో ఉన్నారు. దీని ద్వారా ఆ ప్రాంతంలో ఉన్న ఉబర్ డ్రైవర్లకు మరింత ఆదాయం చేకూరింది. భారతదేశంలో జరుగుతోన్న అతిపెద్ద వ్యాక్సిన్ కార్యక్రమానికి మరింత మద్దతుగా లీడింగ్ ఎన్జీఓ అయినటువంటి HelpAge Indiaతో భాగస్వామ్యం కుదుర్చుకుంది ఉబర్. హెల్ప్ ఏజ్ ఇండియా ఎలాంటి ఆసరా లేని వయో వృద్ధుల అండగా ఉండి సాయం చేస్తుంది.
ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ ద్వారా ఉబర్ రాబోయే రోజుల్లో దాదాపు 25,000 ఉచిత రైడ్ లను అందించబోతోంది. దీనిద్వారా 19 నగరాల్లోని ఆసరా లేని వృద్ధులు వ్యాక్సినేషన్ సెంటర్కు ఉచితంగా వెళ్లి వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఆ 19 నగరాలు ఏవంటే… ఢిల్లీ ఎన్ సిఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, హైదరాబాద్, కొచ్చి, కోల్కతా, లక్నో, భువనేశ్వర్, డెహ్రాడూన్, జైపూర్, విజయవాడ, విశాఖపట్నం, మంగళూరు, ఇండోర్, మరియు జోధ్ పూర్.
భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా మొదటగా మార్చి 3న ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW), రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక స్వచ్ఛంద సంస్థలకు మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేసింది. అందులో భాగంగా మొదటి విడతగా 10 కోట్ల విలువైన ఉచిత రైడ్లను అందించింది.
ఈ సందర్భంగా ఉబర్ ఇండియా మరియు దక్షిణాసియా అధ్యక్షుడు ప్రభ్జీత్ సింగ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. 60,000 ఉచిత రైడ్ లను ఇప్పటికే భారతీయులు ఉపయోగించుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. వాటిని రాబోయే రోజుల్లో మరింత మంది ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. తద్వారా కోవిడ్ యొక్క వ్యాప్తిని తగ్గించే అవకాశం మనకు కలుగుతుంది. ఇవాళ మేము మళ్ళీ వెనుకబడిన మరియు ఆసరా లేని వృద్ధుల వ్యాక్సినేషన్ కోసం హెల్ప్ ఏజ్ ఇండియాతో చేతులు కలుపుతున్నాము. ఈ భాగస్వామ్యం వారికి మరింత సమర్థవంతమైన భద్రతను అందించడానికి సహాయపడుతుంది. అలాగే దేశ ఆర్థిక ప్రగతికి కూడా వీలు కలుగుతుంది. రాబోయే రోజుల్లో భారతదేశం యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మద్దతు ఇచ్చేందుకు ఉబర్ సదా కట్టుబడి ఉంటుంది అని అన్నారు ఆయన. అక్టోబర్ 2020లో అసరా లేని వృద్ధుల కోసం, వారిని వ్యాక్సిన్ సెంటర్లకు తరలించేందుకు, రెస్క్యూ, రిలీజ్ మరియు మెడికల్ అవసరాల కోసం కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా హెల్ప్ ఏజ్ ఇండియా రిసోర్స్ మొబిలైజేషన్ కంట్రీ హెడ్ శ్రీ మధు మోహన్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం ఉబర్ ఇండియాతో మళ్లీ భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ మహమ్మారి పెద్దలకు అతి ప్రమాదంగా తయారైంది. దీంతో సెకండ్ వేవ్లో ఎక్కువమంది వృద్ధులకు టీకా అందేలా చూడడం చాలా కీలకంగా మారింది. దీంతో… వృద్ధుల్లో అవగాహన పెంచడం ద్వారా వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మద్దతు ఇస్తోంది హెల్ప్ ఏజ్ ఇండియా. అలాగే వారి రిజిస్ట్రేషన్, రవాణా కోసం ఉబర్ నుంచి మా మద్దతు ఉంది. దీని ద్వారా మా ప్రయత్నాలు మరింత బలోపేతం అవుతాయి. తద్వారా వేలాది మందికి టీకాలు వేయడానికి అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం నగరాల్లో లభ్యం అవుతున్న మా టోల్ ఫ్రీ నేషనల్ ఎల్డర్ హెల్ప్ లైన్ నెంబరు 1800-180-1253 ద్వారా మాతో మాట్లాడవచ్చు. అలా మాట్లాడడం ద్వారా నిరాశ్రయులైన వృద్ధుల అవసరాలకు తగ్గట్లుగా మేం స్పందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తాజా వార్తలు
- ➲
- స్టోరి
- 23 Apr,2021 04:26PM