న్యూ ఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ప్రధాని మోడీ అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు ఉదయం జరిగిన సమావేశంలో కేజ్రీవాల్ ఆక్సిజన్ కొరతను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా.. ప్రధాని మోడీ కల్పించుకుని.. 'ఏం జరుగుతోంది. ఇది మన సంప్రదాయానికి, నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అంతర్గత సమావేశాన్ని ఒక సీఎం ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నారు. ఇది సముచితం కాదు. మనం సంయమనం పాటించాలి అంటూ తీవ్రంగా వ్యతిరేకించారు. కేజ్రీవాల్ను ఉద్దేశించి మందలించారు. కాగా, దీనిపై ఢిల్లీ సీఎం స్పందిస్తూ.. ప్రధానిని క్షమించమని కోరారు. జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. ఆ తరవాత కేజ్రీవాల్ తాను మాట్లాడుతున్న అంశాన్ని కొనసాగించారు.
Mon Jan 19, 2015 06:51 pm