కృష్ణా: కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలోని కండ్రిక పాతపాడు రహదారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ బోల్తా పడటంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. మృతి చెందిన వారు విజయవాడలోని వాంటే కాలనీ వాసులుగా పోలీసులు గుర్తించారు.
Mon Jan 19, 2015 06:51 pm