అమరావతి: ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా ఆదిత్యనాథ్దా్సను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ఆ పదవిలో ఈ నెల 30 మధ్యాహ్నం వరకు కొనసాగుతారు. అనంతరం పదవీ విరమణ చేస్తారు. పదవీ విరమణ అనంతరం ఆయనకు సీఎం ముఖ్య సలహాదారు పదవి ఇస్తూ శనివారం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి(రాజకీయ) రేవు ముత్యాలరాజు ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అనేకమంది సలహాదారులు ఉండగా... ఇప్పుడు దాస్ను మరో సలహాదారుగా నియమించినట్లైంది. ఆదిత్యనాథ్దా్సకు కేబినెట్ హోదా కూడా ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్నుంచి ఆయన విధులను నిర్వర్తిస్తారు. అయితే ఏ విధులు అన్నది తర్వాత ఇచ్చే ఉత్తర్వుల్లో పేర్కొంటామని తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm