వాషింగ్టన్: అమెరికాలో మోంటానాలో పెను ప్రమాదం తప్పింది. మోంటానాలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. సియాటెల్ నుంచి చికాగో మధ్య నడిచే రైలు.. శనివారం సాయంత్రం 4 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) జోప్లిన్ వద్ద ప్రమాదానికి గురైందని అధికారులు తెలిపారు. ఐదు బోగీలు పట్టాలు తప్పాయని, ప్రమాద సమయంలో రైలులో 147 మంది ప్రయాణికులు,13 మంది సిబ్బంది ఉన్నారని వెల్లడించారు.
Mon Jan 19, 2015 06:51 pm