చెన్నై: కోడియక్కరై ప్రాంతానికి ఆగ్నేయ దిశగా సముద్రంలో చేపలవేట సాగిస్తున్న ముగ్గురు తమిళ జాలర్లపై శ్రీలంక సముద్రపు దొంగలు దాడి జరిపి వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకెళ్ళారు. వేదారణ్యం సమీపం ఆరుక్కాట్టుతురైకి చెందిన శివకుమార్ (32), ఆయన తండ్రి చిన్నతంబి (72), సోదరుడు శివా (33)తో కలిసి ఫైబర్ పడవలో సముద్రంలో చేపలవేటకు వెళ్ళారు. శనివారం వేకువజామున కోడియక్కరై సమీపంలో చేపలుపడుతుండగా రెండు పడవలలో చుట్టుముట్టిన శ్రీలంక సముద్రపు దొంగలు కత్తులతో వారిపై దాడి జరిపి పడవలో ఉన్న 400 కేజీల బరువున్న వలలు, జీపీఎస్ పరికరాలు, సెల్ఫోన్లు దోచుకుని మెరుపువేగంతో పారిపోయారు. ఈ సంఘటనలో ఆ ముగ్గురు జాలర్లు తీవ్రంగా గాయపడి తీరానికి చేరుకున్నారు. ముగ్గురిని నాగపట్టినం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్సకోసం తరలించారు.
Mon Jan 19, 2015 06:51 pm